వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'నమో వెంకటేశా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ కుమార్లు నిర్మాతలు. డి.సురేష ్బాబు సమర్పకుడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ 'పర్వతనేని వెంకటరమణ అనే పాత్రలో నటిస్తున్నాను. ఇందులో వెంకటేశ్వర స్వామి భక్తుని పాత్ర పోషిస్తున్నాను. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో అన్ని అంశాలూ వ్ఞంటాయి అని అన్నారు. డి.సురేష్బాబు మాట్లాడుతూ ' ఈ చిత్రంలోని రెండు పాటలను ఐస్ల్యాండ్లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. డిసెంబర్ రెండోవారంలో ఆడియోను విడుదల చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తాం అని చెప్పారు.
No comments:
Post a Comment